Breaking News

23/09/2019

సీఎస్ తో ఆమెరికా అధికారి భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 23, (way2newstv.in)
విద్య, వైద్య, ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలలో సహకారం అందించుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి    డా.ఎస్.కె.జోషి అన్నారు.సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఆమెరికా దైత్యాధికారి జోయల్ రీఫ్ మ్యాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. 
సీఎస్ తో ఆమెరికా అధికారి భేటీ

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి   కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం తో పాటు సాగు నీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.మంచి వాతావరణంలో మంచి ఈకో పద్దతు లతో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆమెరికా, భారత్ ప్రత్యేకంగా  తెలంగాణ రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని అన్నారు.విద్యార్ధుల సమస్యలు ఏమైనా ఏర్పడినపుడు వెంటనే స్పందించాలన్నారు. జోయల్ రీఫ్ మ్యాన్ మాట్లాడుతూ తెలంగాణ, ఆమెరికా ల స్నేహ పూర్వక మైత్రి మరింత పెంపొందించేలా కృషి చేస్తామనిఅన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆమెరికా దౌత్య కార్యాలయం నిర్మాణం పరిస్ధితి పై చర్చించారు.

No comments:

Post a Comment