Breaking News

14/08/2019

కేంద్రం చెప్పినా జగన్ వినలేదు: చంద్రబాబు

అమరావతి ఆగష్టు 14 (way2newstv.in)         
:విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష మంచిది కాదని...రాష్ట్రానికి పెట్టుబడులు దూరమవుతాయని కేంద్రం చెప్పినా ఏపీ సీఎం జగన్ వినలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కేంద్రం చెప్పినా జగన్ వినలేదు: చంద్రబాబు

స్వయంగా కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి చెప్పారని, అయినా వినలేదన్నారు. ఇప్పుడు జపాన్ రాయబార కార్యాలయం కూడా...ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్‌కు లేఖ రాసిందన్నారు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే... మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రందాటి, దేశందాటి, జగమంతా వారికి హితవాక్యాలు చెబుతున్నారని, బహుశా ఇలా చెప్పించుకోవడం వైసీపీ వాళ్లకు గర్వకారణంగా ఉందో ఏమో!.. పిచ్చికి అనేక రూపాలు మరి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment