Breaking News

06/08/2019

స్టూడెంట్స్ గ్యాంగ్ వార్... ఒకరి హత్య

తిరుపతి ఆగష్టు6 (way2newstv.in - Swamy Naidu)
స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ తిరుపతిలో ఒకరి హత్యకు దారితీసింది. తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో  చదువుతున్న కొందరు విద్యార్ధుల మధ్య వార్ నెలకొన్నది దాంతో డిగ్రీ   ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్న ద్వారకనాథ్ అనే విద్యార్ధిని శెట్టిపల్లి రైల్వే గేటు వద్దకు పిలిపించి బీరు బాటిల్ లతో దాడి చేసి కత్తులతో మెడపై పొడిచి దారుణ హత్య చేశారు.
 స్టూడెంట్స్ గ్యాంగ్ వార్... ఒకరి హత్య
ద్వారకనాథ్ కడప జిల్లా రైల్వేకోడూరు కు చెందిన యువకుడు. తల్లిదండ్రులు కువైట్ లో ఉంటుండగా ఏడాదిన్నర క్రితం చదువుకునేందుకు తిరుపతికి వచ్చి శెట్టిపల్లిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. విద్యార్థుల మధ్య గొడవలే హత్యకు కారణమని అలిపిరి పోలీసులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment