Breaking News

05/08/2019

మంచిర్యాలలో నాగుల చవితి

మంచిర్యాల ఆగస్టు 5, (way2newstv.in)
శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజును “ నాగ పంచమి“గా కొంతమంది “గరుడ పంచమి”గా కొంత మంది పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో “నాగ పూజ’’ కి ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయంగా ఆచరణలో ఉంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం లో నాగపంచమిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ  శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగ పంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంటుంది. అందుకు కారణం ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు.  అందుకు ఆదిశేషుడు “తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని“ వరం కోరుకున్నాడు. 
మంచిర్యాలలో నాగుల చవితి

ఆదిశేషుని కోరికని మన్నించి మహా విష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరాన్ని ఇస్తాడు.నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించిన వారికి " విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ "ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతీ రోజూ, నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశం అభివృద్ధి అవుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యాలు సవ్యంగా నెరవేరతాయి. కాల సర్ప దోషాలు, నాగ దోషాలు తొలగి పోతాయి. అని నమ్ముతున్నట్లు వారు తెలిపారు

No comments:

Post a Comment