Breaking News

24/07/2019

కర్ణాటక పూర్తయింది... ఇప్పుడు మధ్యప్రదేశేనా...

న్యూఢిల్లీ, జూలై 24, (way2newstv.in)
ఎన్నికలు అన్నవి ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ. వాటి ద్వారా అధికారాన్ని సంపాదించిన పాలకులు ప్రజలకు మేలు చేయడం ముఖ్యమైన బాధ్యత. అయితే ఇపుడున్న పరిస్థితులు చూస్తే ఒక ఎన్నికతో దాహం తీరడం లేదు. గెలిచిన వారు నెక్స్ట్ టార్గెట్లు పెట్టుకుంటే, ఓడిన వారు ఎటూ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో రాజకీయమే పరమావధిగా మారుతోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండవమారు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయిదేళ్ళకు సరిపడా హామీలు ఇచ్చిన మోడీ వాటిని నెరవేరుస్తారని కోటి ఆశలతో వందన్నర కోట్ల భారతం ఎదురుచూస్తోంది. అయితే మోడీ, అమిత్ షా ఎత్తులు జిత్తులు వేరేగా ఉన్నాయి. దాంతో అనేక ప్రతిపక్ష రాష్ట్రాల్లో రాజకీయ అశాంతి చెలరేగుతోంది.
కర్ణాటక పూర్తయింది... ఇప్పుడు మధ్యప్రదేశేనా...

వూహిస్తున్నట్లుగానే కర్నాటకలో బీజేపీ రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టింది. అక్కడ కుమార స్వామి సర్కార్ ని ఇంటికి పంపించి తాము గద్దె మీద కూర్చోవాలన్నది బీజేపీ ప్లాన్. ఆ దిశగా ఇపుడు వ్యూహాలు సాగుతున్నాయి. రాజ్ భవన్ లో గవర్నర్ వాజ్ బాయ్ బీజేపీ మనిషి. మెజారిటీ ఎంపీలు ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దన్నుగా ఉంది. దాంతో ఉన్న ప్రభుత్వం నడ్డి విరిచి తాము ఏలికలు కావాలన్న కసితో అశ్వమేధ యాగాన్ని బీజేపీ మొదలెట్టింది.కర్ణాటకలో వారాల తరబడి సాగుతున్న క్యాంప్ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూంటే మూడు నెలల క్రితం వరకూ రెచ్చిపోయిన ప్రతిపక్షాల గొంతు మాత్రం ఇపుడు ఎక్కడా పెగలడంలేదు. ఎందుకంటే వారంతా పరాజయ గాయలపాలైన వారే. ఇక మధ్యప్రదేశ్ లో కూడా కర్నాటక ఫార్ములాతో బీజేపీ పావులు వేగంగా కదుపుతోంది. అక్కడ కేవలం అయిదు మంది మాత్రమే బీజేపీ కంటే కాంగ్రెస్ పక్షాన ఎక్కువగా గెలిచారు. కర్నాటకం తరువాత మధ్యప్రదేశ్ కధ మొదలవుతుందన్న మాట. దాని తరువాత రాజస్థాన్ అంటున్నారు. మరో వైపు తెలంగాణాలో కూడా అవకాశాలు ఏమైనా ఉంటే వెతకాలని బీజేపీ డిసైడ్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీలో జగన్ సర్కార్ ఏడాది పాలన వరకూ చూసి అపుడు ఇక్కడ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేయాలన్నది బీజేపీ నయా వ్యూహంగా ఉంది. ఇవన్నీ చూస్తూంటే రాజకీయమే తప్ప పాలన నేను చేయను, మిమ్మల్ని చేయనివ్వను అంటూ ప్రతిపక్షాలతో కాషాయం పార్టీ గట్టి శపధమే చేసినట్లుగా కనిపిస్తోనంది.మధ్యప్రదేశ్ లో కూడా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతే దానికి బీజేపీ కారణం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులే తమ ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణమన్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ దానికి మద్దతిస్తున్న బీఎస్పీ,ఎస్పీ నాయకుల మధ్య అంతర్గత విభేధాలున్నాయన్నారు. వారి మధ్య విభేధాలు వచ్చి ఏదైనా జరిగితే అప్పుడు తాము ఏమీ చేయలేమంటూ సంచలన కామెంట్స్ చేశారుశివరాజ్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి జితు పట్వారీ మాట్లాడుతూ.... తమ ప్రభుత్వానికి సమస్యలు సృష్టించేందుకు బీజేపీ చేయాల్సినదంతా చేసింది. అయితే ఇది కుమారస్వామి ప్రభుత్వం కాదు కమల్ నాథ్ ప్రభుత్వమన్నారు.గతేడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 108 సీట్లలో విజయం సాధించింది. బీఎస్పీ 2,ఎస్పీ 1 స్థానంలో విజయం సాధించగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు,నలుగురు ఐఎన్ డీ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 121మంది సభ్యుల మద్దతు అవసరమవడంతో బీఎస్పీ ఎస్పీ,ఐఎన్ డీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

No comments:

Post a Comment