Breaking News

19/06/2019

వడివడిగా చంద్రయాన్ అడుగులు


బెంగళూర్, జూన్ 19, (way2newstv.in)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌–2 ప్రయోగానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జూలై 15న చంద్రయాన్-2‌ను ప్రయోగించనున్నారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా దీనిని చంద్రుడి వద్దకు పంపుతారు. ఈ రాకెట్ ద్వారా ల్యాండర్ ఆర్బిటర్ మంగళవారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా అత్యంత భారీ భద్రత నడుమ షార్‌ కేంద్రానికి తరలించారు. షార్‌లోని ఉపగ్రహం గదిలో వివిధ పరీక్షల అనంతరం రాకెట్ శిఖర భాగాన దీనిని అమర్చనున్నారు. ఇప్పటికే చంద్రయాన్-2కు సంబంధించిన రోవర్ అర్బిటర్ షార్‌కు చేరుకుంది. 


వడివడిగా చంద్రయాన్ అడుగులు
రెండో ప్రయోగ వేదిక వద్ద రాకెట్ అనుసంధాన కార్యక్రమాలను శాస్తవ్రేత్తలు శరవేగంగా చేస్తున్నారు. చంద్రయాన్-2ను జూలై 15న తెల్లవారుజామున 2.51 గంటలకు చేపడతారు. మానవరహిత నౌక చంద్రయాన్-1ను అక్టోబరు 2008లో ఇస్రో పంపింది. ఈ ప్రయోగం విజయవంతమవడంతో చంద్రయాన్-2 ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. గత నాలుగైదేళ్లుగా చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో జూలై 15న నింగిలోకి పంపుతోంది. ఇందులో భాగంగా మంగళవారం బెంగళూరులోని అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయంలో 60 మంది శాస్త్రవేత్తలతో రెండో లూనార్‌ సైన్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ ప్రయోగంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 8 ఆర్బిట్‌ పేలోడ్స్, మూడు ల్యాండర్‌ పేలోడ్స్, రెండు రోవర్‌ పేలోడ్స్‌ పంపేందుకు సన్నాహాలు చేస్తున్న అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. జూన్ 13, 14 తేదీల్లో చంద్రయాన్‌–2 ప్రయోగంపై ఇస్రో హెడ్‌క్వార్టర్‌లో సైన్స్‌ మీట్‌ నిర్వహించారు. రెండోసారి నిర్వహించిన లూనార్‌ సైన్స్‌మీట్‌కు వివిధ పరిశోధనా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, ఇస్రో కేంద్రాలు, ప్రయోగశాలల నుంచి సుమారు 60 మంది శాస్త్రవ్తేతలు హాజరయ్యారు. చంద్రయాన్‌–2లో పంపబోయే నాలుగు పేలోడ్స్‌ గురించి కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది. 

No comments:

Post a Comment