Breaking News

18/05/2019

కేసీఆర్ కు వీహెచ్ శాపనార్ధాలు


హైద్రాబాద్, మే 18  (way2newstv.in):
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలవడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పూర్తిగా గర్వం పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఈ గర్వాన్ని పెద్దమ్మ తల్లి తప్పనిసరిగా అణచివేస్తోందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రెండేళ్లలో పడిపోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై వీహెచ్ ఘాటు విమర్శలు చేశారు..హాజీపూర్ బాధిత కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ బావిలో ధర్నాకు దిగినవారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమయినా ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత కుమారుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే కేసీఆర్ పరామర్శించడానికి వెళ్లారనీ, కానీ హాజీవూర్ బాధితులను కలుసుకోవడానికి మాత్రం వెళ్లలేదని దుయ్యబట్టారు. 



కేసీఆర్ కు వీహెచ్ శాపనార్ధాలు

ఈరోజు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు.‘నీకు మనవడి మీద ప్రేమ ఉంది కానీ మామీద(ప్రజలు)  ప్రేమ లేదా? అని అడుగుతున్న. నీకు నీ మనవడు ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులకు వాళ్ల పిల్లలు అంత ఇంపార్టెంటు. 26 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే పట్టించుకోవు. రేప్ చేసిన శ్రీనివాసరెడ్డిని ఎన్ కౌంటర్ చేయవు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వవు. మీడియాకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలే. రోజూ హాజీపూర్ కు పోతున్నరు. అక్కడి పరిస్థితులను కవర్ చేస్తున్నరు. తెలంగాణలో నియంత రాజ్యం నడుస్తోంది. పెద్దమ్మతల్లీ.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోవాలే. ప్రజల ఉసురు ముట్టాలే’ అని మండిపడ్డారు. హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగే వరకూ, అంబేడ్కర్ విగ్రహం పెట్టేవరకూ, 26 మంది ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్.. నీకు బాగా నెత్తికెక్కిందిరా బాబు.. ప్రజలను నిన్ను తిప్పితిప్పి కొడతారు’ అని హెచ్చరించారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పదేళ్లు గవర్నర్ గా ఉన్నప్పటికీ నరసింహన్ చేసిందేమీ లేదనీ, ఆయన తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన నిలబడటానికి సరిగ్గా ఫిట్ అవుతారని ఎద్దేవా చేశారు. ఆయన గుళ్లు,గోపురాలకు తిరగడానికే పనికి వస్తారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు.మర్రి చెన్నారెడ్డి రాజస్థాన్ గవర్నర్ గా ఎలా వ్యవహరించారో తాను చూశానని వీహెచ్ చెప్పారు. ఈఎస్ఎల్ నరసింహన్ కు తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన చోటు ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబుకు రేపు తాను లేఖ రాస్తానని తెలిపారు. నరసింహన్ ను తిరుమలకు పంపితే ఓవైపు శ్రీ వేంకటేశ్వరస్వామిని చూసుకుంటూ మరోవైపు తనను కలవడానికి వచ్చే వీఐపీలతో కూడా సమావేశమవుతారని ఎద్దేవా చేశారు

No comments:

Post a Comment