Breaking News

18/05/2019

జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదులను హతమార్చిన సైన్యం


శ్రీనగర్ మే 18  (way2newstv.in):
జమ్మూ కశ్మీర్‌లో శనివారం ఉదయం వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులను సైన్యం హతమార్చింది. దక్షిణ కశ్మీర్‌ పుల్వామా జిల్లా అవంతిపొరలోని పంజగామ్ వద్ద జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. పంజగామ్‌లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా శనివారం తెల్లవారుజామున 2.10 గంటల ప్రాంతంలో పంజగామ్ చేరుకుని, చుట్టుమట్టింది. సైన్యం రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. 



జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదులను హతమార్చిన సైన్యం

దీంతో సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అక్కడ మరో ఉగ్రవాది ప్రాణాలతో ఉన్నట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలిలో మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్న సైన్యం వారిలో ఒకరు హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది షౌకత్ అహ్మద్ దార్‌‌గా గుర్తించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని దెహుర్ణాలోనూ మరో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇక్కడ ఉగ్రవాదులున్నరానే నిఘా వర్గాల పక్కా సమాచారంతో 19 రాష్ట్రీయ రైఫిల్స్, ఎస్ఓజీ పోలీసులు సంయుక్తంగా దాడిచేశారు. సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌గా మారింది. ఇక్కడ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులున్నట్టు భావిస్తున్నారు. అవంతిపొర, దెహుర్ణాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, ఎలాంటి వదంతులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. గురువారం దొలిపొర వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చగా, ఇదే ఘటనలో ఓ సైనికుడు, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. 

No comments:

Post a Comment