నిర్మల్, మే 03 (way2newstv.in)
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సి. శశిధర్ రాజు అన్నారు. శుక్రవారం నిర్మల్ పోలీస్ కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ పోలీసు రూట్ మొబైల్స్ అధికారులతో ఎన్నికల అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోవు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ బూతులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవాలన్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నార్మల్ పోలింగ్ కేంద్రాల గురించి, ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేశామని, జిల్లాలో గత ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు, గతంలో జరిగిన ఎన్నికలలో సమస్యాత్మక గ్రామాల గురించి, రూట్ మొబైల్స్ గురించి, జిల్లా పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా పరిధిలోని అన్నీ బార్డర్ పి.ఎస్ పరిధిలల్లో ( స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్), చెక్ పోస్టుల గురించి వివరించారు. ఎన్నికల రోజున పోలింగ్ బూతుల వద్ద నిర్వహించాల్సిన విధులు పై వివరించారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపినారు. ఈ సమావేశంలో డి.ఎస్పీ ఉపేందర్ రెడ్డి, సి ఐ లు శ్రీనివాస్ రెడ్డి,రమేష్ బాబు,అశోక్, ఎస్సైలు, రూట్ మొబైల్స్ అధికారులు మరియు సిబ్బంది పాల్గోన్నారు.
No comments:
Post a Comment