Breaking News

20/04/2019

స్కూళ్లు తెరిచే నాటికి హాస్టళ్ల లో సౌకర్యాలు

నిజామాబాద్, ఏప్రిల్ 20, (way2newstv.in)
నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ హాస్టళ్ల దశ మారనుంది. విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు వార్డెన్‌ల నుంచి సంబంధిత హాస్టళ్లలో సౌకర్యాల లేమిపై వివరాలను తీసుకున్నారు. ఆ నివేదికలను క్రోడీకరించి కలెక్టర్‌తో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు నివేదించారు. జిల్లాలో 36 పాఠశాల హాస్టళ్లు, 10 కళాశాల హాస్టళ్లు ఉండగా వీటిలో 4,900 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే ఆయా హాస్టళ్లలో తలుపులు, కిటికీలు, విద్యుత్‌ సౌకర్యం, గోడలకు రంగులు, సున్నం, వాటర్‌ సప్లయి, బోర్‌వెల్, పంపు సెట్టు, సెప్టిక్‌ ట్యాంక్, తదితర మరమ్మతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


స్కూళ్లు తెరిచే నాటికి హాస్టళ్ల లో సౌకర్యాలు

అన్ని హాస్టళ్లను కలుపుకుని దాదాపు 60 వరకు టాయ్‌టెట్లు, బాత్‌ రూంలు అదనంగా అవసరం ఉన్నాయని నివేదికలో చేర్చారు. ఎనిమిది హాస్టళ్లకు ప్రహరీలు, వాల్‌ గేట్లు అవసరం ఉందని పేర్కొన్నారు. మరమ్మతులు,  నూతన నిర్మాణాలకు కలిపి దాదాపు రూ.2 కోట్ల 10 లక్షల వరకు నిధులు అవసరం అవుతాయని కలెక్టర్‌కు నివేదించారు. అయితే హాస్టళ్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తెప్పిం చుకోవడం లేదా కలెక్టరే తన నిధుల నుంచి సమకూర్చుతారని సమాచారం. నిధుల అంశం కొలి క్కి రాగానే ఆర్‌అండ్‌బీ, లేదా పంచాయతీ రాజ్‌ అధికారులతో హాస్టళ్లకు మరమ్మతులు, టాయిలెట్లు, బాత్‌ రూంలు, ప్రహరీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నెల 23 నుంచి హాస్టళ్లకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఉం టాయి. ఈ సమయంలో మరమ్మతులు, నిర్మాణాలు పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం జూన్‌ రెండు లేదా మూడవ

No comments:

Post a Comment