Breaking News

28/03/2019

వీడియో జర్నలిస్టులకు బాలయ్య క్షమాపణ

అనంతపురం, మార్చి 28, (way2newstv.in)
డియో జర్నలిస్టుపై చేయి చేసుకున్న సినీ హీరో, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య తీరుపై విమర్శలు రావడంతో తన తప్పును గ్రహించారు. సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని.. మీడియా మిత్రులకు బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానన్నారు బాలయ్య. బాలకృష్ణ తన పోస్ట్‌లో ‘మీడియా మిత్రులకి నమస్కారం, నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది, అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. 


వీడియో జర్నలిస్టులకు బాలయ్య క్షమాపణ

అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఈ విషయం లో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ... మీ నందమూరి బాలకృష్ణ’. బుధవారం బాలకృష్ణ హిందూపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారట. కొందరు పిల్లలు కాన్వాయ్‌కు అడ్డుగా రావడంతో.. బాలయ్య సెక్యురిటీ సిబ్బంది వారిని పక్కకు లాక్కెళ్లారట. ఈ సీన్‌ను ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి వీడియో తీశాడు. వెంటనే గమనించిన బాలయ్య అతడిపైకి దూసుకెళ్లారు. కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోను వెంటనే తొలగించాలని చేయి చేసుకున్నారు. బాలయ్య మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడాన్ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు మొబైల్‌లో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది క్లారిటీ రాలేదు. బాలయ్య మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడంపై జర్నలిస్ట్‌ సంఘాలు మండిపడ్డాయి. దీంతో బాలయ్య వెనక్కు తగ్గారు.. క్షమాపణలు చెప్పారు.

No comments:

Post a Comment