Breaking News

23/03/2019

ఎన్నికల్లో కుబేరులు

నారాయణ, విశ్వేశ్వరరెడ్డిలే టాప్ 
హైద్రాబాద్, మార్చి 23   (way2newstv.in)
తెలుగు రాష్టాల్లో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటు రెబెల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ అంటే సాదాసీదాగా దరఖాస్తు సమర్పించి వచ్చేస్తే కుదరదు కదా. విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు అన్నింటినీ అందులో తెలపాలి. నామినేషన్ పత్రాల్లో చూపించిన ఆస్తుల ప్రకారం ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కోటీశ్వరులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. తెలంగాణలో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఆస్తులున్న అభ్యర్థిగా నిలిచారు.


ఎన్నికల్లో కుబేరులు

నామినేషన్‌లో పేర్కొన్న ప్రకారం ఆయన ఆస్తులు రూ.895కోట్లు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందిన విశ్వేశ్వర్‌రెడ్డి... అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన తర్వాత ఏపీలోని నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న నారాయణ రూ.650కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. నారాయణ విద్యాసంస్థల అధిపతి అయిన నారాయణ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు రూ.339కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్‌లో పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నారా లోకేశ్ తన పేరిట రూ.253.68 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డికి రూ.163కోట్లు, జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 119.75కోట్ల ఆస్తులున్నాయి. 

No comments:

Post a Comment