Breaking News

29/03/2019

వీవీప్యాట్ల లెక్క పెంచితే.. కౌంటింగ్‌కు 6 రోజులు

సుప్రీం కోర్ట్ కు వెల్లడించిన ఎన్నికల సంఘం
న్యూ ఢిల్లీ మార్చ్ 29 (way2newstv.in)
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది. ఒకవేళ వీటి లెక్కింపును పెంచితే గనుక మొత్తం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని ఈసీ పేర్కొంది.


వీవీప్యాట్ల లెక్క పెంచితే.. కౌంటింగ్‌కు 6 రోజులు

ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా దాదాపు 21 పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడంలో ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో నేడు ఈసీ తమ స్పందన తెలియజేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న విధానం సరైందేనని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని ఈసీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానంలో ఒక్క వీవీప్యాట్‌ను మాత్రమే ఎంచుకుని దానిలోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తున్నారు. దీనివల్ల ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కేవలం 0.44 శాతం ఓటరు స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు. ఇన్ని తక్కువ స్లిప్పులు లెక్కిస్తే కచ్చితత్వం తెలియదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.

No comments:

Post a Comment