Breaking News

29/03/2019

‘సౌభాగ్య సీమ’ ద్వారా సీమ అభివృద్ధి: పవన్‌

కర్నూలు మార్చ్ 29  (way2newstv.in)
సౌభాగ్య సీమ పథకం ద్వారా రాయలసీమ రైతులను ఆదుకుంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ పథకం కింద కేసీ కెనాల్‌ ద్వారా రెండు పంటలకు నీరందిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 


‘సౌభాగ్య సీమ’ ద్వారా సీమ అభివృద్ధి: పవన్‌

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వెంచర్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాయలసీమను కరవు ప్రాంతంగా ప్రకటిస్తామన్నారు. ఇది పదేళ్లు పాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, ప్రతి రైతుకూ రూ.5వేలు పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ఎకరాకు రూ.8వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment