Breaking News

20/03/2019

3.84 కోట్లకు చేరిన ఏపీ ఓటర్లు

విజయవాడ, మార్చి 20, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య జనవరితో పోలిస్తే మరో 15 లక్షలు పెరిగింది. దీంతో ఏపీలో మొత్తం ఓటర్లు 3.84 కోట్లకు చేరుకుందని మంగళవారం ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మార్చి 25న తుది జాబితా ప్రకటించేనాటికి ఈ సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది 18 లక్షలు అధికం. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో ఓటర్లు సంఖ్య 3,67,60,880గా ఉంది. ఇక, 2019 జనవరి 11 నాటికి ఓటర్లు 3.69 కోట్లు కాగా, ప్రస్తుతం 1.55 లక్షల ఓట్లను తొలగించారు. 


3.84 కోట్లకు చేరిన ఏపీ ఓటర్లు

ఇంకా 10,62,441 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందని ద్వివేది వెల్లడించారు. అలాగే కొత్త ఓటర్లుకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ ఏప్రిల్ 5లోగా పూర్తిచేస్తామని ఆయన తెలియజేశారు. జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2019కు సంబంధించిన తుది జాబితా ప్రచురించే నాటికి ఓటర్ల సంఖ్య 3.69 కోట్ల ఉండగా, మూడు నెలల వ్యవధిలో 15 లక్షల మంది పెరిగారని పేర్కొన్నారు. ఓటు నమోదుకు వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 10,62,441 పరిశీలన పూర్తి చేయాల్సి ఉందని, మార్చి 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 9.50 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశముందని ఆయన వివరించారు. అలాగే ఓట్ల తొలగింపునకు సంబంధించి జనవరి 11 తర్వాత దాదాపు 9 లక్షలకు పైగా ఫారం-7 దరఖాస్తులొచ్చాయని, వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 1,55,099 మంది పేర్లను జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. వీటిలో చనిపోయినవారు, వలసపోయిన వారు, ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లున్నవారు ఉన్నారన్నారు. మిగతా దరఖాస్తులను నకిలీవిగా గుర్తించి తిరస్కరించామని, వీటిపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment