Breaking News

14/02/2019

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మంథని, ఫిబ్రవరి 13 (way2newstv.in):
 మంథని మండలంలోని అక్కెపల్లి , గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్దపల్లి , తుర్కపల్లి గ్రామాలలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం రోజున నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా  మందులను పంపిణీ చేశారు. 


 సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించిన నలుగురిని మెరుగైన వైద్యం అందించడం కోసం సెంటనరి కాలనీకి రిఫర్ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధ రాజయ్య , డాక్టర్ పద్మ , వార్డ్ సభ్యులు శ్రీధర్ ,ఇతర వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment