Breaking News

25/02/2019

రాష్ట్రంలో కరువు పోవాలంటే చంద్రబాబు పోవాలి

పచ్చదనం రావాలి అంటే జగన్ రావాలి
కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
కౌతాళం ఫిబ్రవరి 25 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ కు కరువు పోవాలంటే చంద్రబాబు పోవాలి ఆంధ్రప్రదేశ్ కు పచ్చదనం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి రావాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. షోమవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమాశేంలో అయన మాట్లాడారు. ముందుగా దేశాయ్ కృష్ణ అధ్యక్షతన మండల ప్రజలు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మరియు ప్రదీప్ రెడ్డి నీ మేళతాళాలతో స్కూటర్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభా వేదికవరకు ఘన స్వాగతం పలికారు. మండల ప్రజలు భారీగా తరలిరావడంతో కార్యకర్తలలో నాయకులలో ఉత్సాహం నింపింది. రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి వైసిపి జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేయాలని  అన్నారు. 


 రాష్ట్రంలో కరువు పోవాలంటే చంద్రబాబు పోవాలి 

కార్యకర్తలకు పోలింగ్ బూత్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరు రోజు రెండు గంటలు ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల గురించి వివరించి 60 రోజుల వరకు సైనికుల కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను కార్యకర్తలను కోరారు. ఎన్నికలు దగ్గర పడడంతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రతి ఒక్కటీ కాపీ కొడుతున్నారని తెలిపారు. నాలుగేళ్లలో గుర్తుకురాని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎలా గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. అమరావతి అని గ్రాఫిక్ సినిమా చూపిస్తున్నారని తెలియజేశారు. టీడీపీ ఇన్ ఛార్జి తిక్క రెడ్డి ని డిపాజిట్ లేకుండా చేయాలని , వైసిపి నీ బారి మెజార్టీ తో గెలిపించే బాధ్యత మి  అందరిపై ఉందని గుర్తుకు చేశారు. అధికారంలోకి రాగానే ఎల్ఎల్సీ నీరు అందక పోతే పులికనుమ ప్రాజెక్ట్ లాంటిది కట్టి మీకు మూడు పుటల నీరు  అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ సర్పంచ్ లను ఎంపీటీసీలు పూలమాలలతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల నాగీరెడ్డి రాష్ట్ర విభజన విభాగపు అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి మండల కన్వీనర్ నాగరాజ్ గౌడ్ వైసిపి నాయకులు ఆత్రేయ గౌడ్ ,కృష్ణంరాజు దేశాయి కృష్ణ, మాబు సాబ్, అవతారం, కార్యకర్తలు ,మాజీ సర్పంచులు, మండల ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment