Breaking News

09/01/2019

ఉత్సాహంగా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్

హైద్రాబాద్  (way2newstv.in)
గ్రీన్ ఛాలెంజ్‌లో సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ.. మరి కొందరికి సవాల్ విసురుతూ.. ఈ పుడమి తల్లికి హరితహరాన్ని అందించే పనిలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే ఎంపీ కవిత, కేటీఆర్, సచిన్, లక్ష్మణ్, మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. తాజాగా కింగ్ నాగార్జున వీరితో చేరారు.


 ఉత్సాహంగా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్
 
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన హరిత ఛాలెంజ్‌ను నాగార్జున స్వీకరించారు. మీకు మాట ఇచ్చినట్టుగానే అన్నపూర్ణ స్టూడియోలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటానని ఎంపీకి నాగ్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు మీ వంతు అంటూ.. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్, తనతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన కార్తీ, తమిళ నటుడు ధనుష్, తన కోడలు సమంతకు నాగార్జున గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నాగ్ వారిని కోరా.

No comments:

Post a Comment