Breaking News

25/08/2018

“ఆంధ్రప్రదేశ్ జర్నీస్”ను ఆవిష్కరించిన సిఎం

అమరావతి 25  (way2newstv.in)
పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఆంధ్రప్రదేశ్ జర్నీస్ సంచికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆవిష్కరించారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆలోచనల మేరకే ఈ పుస్తకం కార్యరూపం దాల్చగా, ప్రతి సంచికను సిఎంతోనే ఆవిష్కరింపచేయటం జరుగుతోంది. ప్రత్యేకించి తెలుగేతర పర్యాటకులకు రాష్ట్ర పర్యాటక రంగం గురించి తెలియచెప్పటమే ధ్యేయంగా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తుండగా, ఇది వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలకు, అయా దేశాలలోని భారత రాయబార కార్యాలయాలకు, ఇండియా లోని విదేశీ రాయబార కార్యాలయాలను పంపుతున్నారు. కార్యక్రమంలో సిఎంతో పాటు రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్య నిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా తదితరులు ఉన్నారు.



“ఆంధ్రప్రదేశ్ జర్నీస్”ను ఆవిష్కరించిన సిఎం

No comments:

Post a Comment