Breaking News

13/07/2018

గిరిజన సంక్షేమంపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్, జూలై 13  (way2newstv.in)
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్ధలు, ట్రైనింగ్ కేంద్రాలను స్పేషియల్ మ్యాపింగ్  చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి     ఆ శాఖాధికారులను ఆదేశించారు.



గిరిజన సంక్షేమంపై సీఎస్ సమీక్ష

శుక్రవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలను సి.యస్ సమీక్షించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, కమీషనర్ క్రిస్టినా చౌంగ్తు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన గిరిజన ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయాలని అన్నారు.  విద్య, వైద్య సౌకర్యాలతో పాటు ఆర్ధికంగా సామాజికంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న వివిధ విద్యా సంస్ధల ద్వారా 2 లక్షలకు పై విద్యార్ధులు చదువుకుంటున్నారని, వీరికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన ప్రైమరీ పాఠశాలలు, అంగన్ వాడీల మద్య సినర్జీ ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యాసంస్ధలో విద్యార్ధులకు సరిపడ ఉపాద్యాయులు ఉండేలా చూడాలన్నారు. గిరిజన విద్యా సంస్ధలో పనిచేస్తున్న సి.ఆర్.పి లు అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అభిప్రాయసేకరణ సేకరించాలని విద్యాపరమైన ప్రతిభను సమీక్షించాలన్నారు. అవసరమైన శిక్షణకు అందించాలన్నారు.
2017-18 విద్యా సంవత్సరానికి గాను 2 లక్షల 28 వేల మందికి పైగా విద్యార్ధులకు ఆర్.టి.ఎఫ్ (RTF), యం.టి.ఎఫ్ (MTF) అందించామని, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యా నిధికింద 123 మందిని ఎంపిక చేశామన్నారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను బెస్ట్  అవేలబుల్ స్కూల్ లలో 6వేల మందికి ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించామని సి.యస్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే ట్రైబల్ మ్యూజియం కు మరింత ప్రాచుర్యం కల్పించి ఎక్కువ మంది సందర్శించేలా చూడాలన్నారు.  స్వయం ఉపాధికి సంబంధించి 205 కోట్ల రూపాయలతో 16,479 మందికి ఆర్థిక సహాయం అందించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గిరిజన శాఖ ద్వారా శిక్షణ పొందిన అనంతరం వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారి నుండి ఫీడ్ బ్యాక్  సేకరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ద్వారా గిరిజనులలో ఉన్న స్కిల్స్ ను ఐడెంటిఫై చేసి వారిలో ఉన్న ప్రతిభను మెరుగుపరచి, ఆర్థికంగా మరింత మేలు జరిగేలా చూడాలన్నారు. ఫ్రీ ఎక్సామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా మెరుగైన శిక్షణ అందించాలన్నారు.
గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా 2,28,175 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 150కోట్లతో 3,400 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో సహాయం అందించాలని నిర్ణయించామన్నారు. ఎస్టీ, ఎస్డీఎఫ్ నిధుల వ్యయాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్  భూములకు సంబంధించి రైతు బంధు చెక్కుల పంపిణీని పూర్తి చేయాలని సి.ఎస్ ఆదేశించారు.

No comments:

Post a Comment