Breaking News

03/01/2020

చిరంజీవీ వర్సెస్ రాజశేఖర్..

కధ ఈనాటిది కాదు
హైద్రాబాద్, జనవరి 3 (way2newstv.in)
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ నిర్వహించిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాబాసగా ముగిసిన సంగతి తెలిసిందే. మాలో సమస్యలు ఉన్నాయంటూ వేదిక మీదే రాజశేఖర్‌ ఆరోపించటం ఆయన వ్యాఖ్యలు చిరంజీవి, మోహన్‌ బాబు, కృష్ణం రాజు లాంటి సినీ పెద్దలు ఖడించటం జరిగాయి. అయితే అసలు చిరు, రాజశేఖర్‌ల మధ్య వివాదం ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల క్రితమే ఈ సమస్య మొదలైంది.మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు, రెబల్ స్టార్‌ కృష్ణం రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరించిన తరువాత చిరు, మాలో సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని మీడియాకు ఎక్కొద్దని హితవు పలికారు. 
చిరంజీవీ వర్సెస్ రాజశేఖర్..

అయితే ఈ మాటలు పట్టించుకోకుండా రాజశేఖర్‌ వేదిక మీద మాలో సమస్యలున్నాయంటూ ఆరోపించటంతో రచ్చ మొదలైంది.తన మాటలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా వేదిక మీద మాలోని సమస్యలను ప్రస్తావించటంపై మెగాస్టార్‌ ఫైర్‌ అయ్యాడు. రాజశేఖర్‌ ఈ కార్యక్రమంలో రసాబాస చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడని.. ఆయన మీద చర్యలు తీసుకోవాలని మా కమిటీకి చెప్పారు. మోహన్‌ బాబు, కృష్ణం రాజులు కూడా రాజశేఖర్‌ తీరును తప్పుపట్టారు.అయితే చిరు, రాజశేఖర్‌ల మధ్య వివాదం ఇప్పటిది కాదు. 2003లోనే ఈ వైరానికి భీజం పడింది. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన రమణ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు రాజశేఖర్‌కు ప్రయత్నాలు చేశాడు. అయితే ఈ లోగా ఈ సినిమా రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్న అల్లు అరవింద్‌, చిరంజీవి హీరోగా ఆ సినిమాను స్టార్ట్ చేశాడు. ఠాగూర్‌ పేరుతో రిలీజ్‌ అయిన ఈ సినిమా చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో రాజశేఖర్‌, చిరుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత కూడా జీవితా రాజశేఖర్ దంపతులు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక దశలో మెగా అభిమానులు రాజశేఖర్‌ కారుపై దాడి చేయటంతో పరిస్థితి మరింత సీరియస్‌ అయ్యింది. ఆ సమయంలో స్వయంగా రాజశేఖర్‌ ఇంటికి వెళ్లిన మెగాస్టార్‌, తన అభిమానుల వల్ల రాజశేఖర్‌ ఫ్యామిలీకి జరిగిన ఇబ్బందికి క్షమాపణలు కూడా చెప్పాడు.అయితే ప్రతీ సందర్భంలోనూ ఇరు వర్గాలు సర్దుకు పోయినట్టుగా కనిపించినా ఏదో ఒక సందర్భంలో ఈ వివాదం మళ్లీ తెర మీదకు వస్తోంది. తాజాగా మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు వివాదాల గురించి ప్రస్థావించొద్దు అని చెప్పిన వెంటనే రాజశేఖర్‌ అదే విషయాన్ని ప్రస్ధావించటంతో కావాలనే ఇలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

No comments:

Post a Comment