Breaking News

09/12/2019

అనాజ్ మండిలో మరోసారి అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ, డిసెంబర్9  (way2newstv.in)
రాజధాని ఢిల్లీలోని అనాజ్‌ మండీలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించి 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నాలుగు అంతస్తుల భవనంలో షార్ట్ షర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, సోమవారం మరోసారి ఇదే భవనంలో మంటలు చెలరేగాయి. దీనిపై తక్షణమే స్పందించిన అగ్నిమాక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటన జరిగి 24 గంటల గడవకముందే మరోసారి మంటలు చెలరేగడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనలో 43 మంది మృతి చెందగా, 21 మంది ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. షార్ట్‌ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి భవనంలో దట్టమైన పొగ అలముకోవడంతో చాలా మంది ఊపిరాడక చనిపోయారు.
అనాజ్ మండిలో మరోసారి అగ్ని ప్రమాదం

 మృతులంతా కార్మికులే కావడం, చాలా మంది 20 ఏళ్లలోపువారే కావడం బాధాకరం. కాగా, బాధిత కుటుంబాలకు కేంద్రం రూ.2లక్షలు, రాష్ట్రం రూ.10లక్షలు పరిహారం ప్రకటించాయి.మృతుల్లో బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే అధికం. అంతేకాదు, 1997లో ఢిల్లీ ఉపహార్‌ సినీ థియేటర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తర్వాత అంతటి తీవ్రమైనది ఇదేనని భావిస్తున్నారు. ఆనాటి ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద చోటుచేసుకున్న ప్రదేశం ఇరుగ్గా ఉండడంతో సహాయక సిబ్బంది అక్కడకు చేరుకోవడమూ కష్టమైంది. కిటికీ ఊచలు కోసి, వాటి ద్వారా భవనం లోపలకు ప్రవేశించగలిగారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఇరుకు సందు కావడంతో పలువురిని ఆటోల్లో బయటకు తీసుకురావాల్సి వచ్చింది.మొత్తం 30 అగ్నిమాపక యంత్రాల సాయంతో అయిదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 150 మంది సిబ్బంది రంగంలోకి దిగి 63 మందిని ఆ భవనం నుంచి కాపాడగలిగారు. అంతమంది ఆ భవనంలో ఉంటారని అగ్నిమాపక సిబ్బంది ఊహించలేదు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ అనేక మంది అక్కడ కనిపించడంలో వారు నివ్వెరపోయారు. 600 చదరపు గజాల స్థలంలోని భవనానికి ఒకే ఒక్క ప్రవేశమార్గం ఉంది. సహాయక చర్యల్లో భాగంగా ఇద్దరు సిబ్బందికీ గాయాలయ్యాయి. మోకాలి గాయాన్నీ లెక్కచేయకుండా ఫైర్‌ఫైటర్‌ రాజేశ్‌ శుక్లా ముందుగా లోపలకు వెళ్లి 11 మందిని కాపాడారు.

No comments:

Post a Comment