Breaking News

16/10/2019

వరుణ్ తేజకు డిమాండ్

హైద్రాబాద్, అక్టోబరు 16(way2newstv.in):
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోరు మీద ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటున్న వరుణ్ తేజ్ తాజాగా ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మాస్ ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా హిట్‌తో వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ పెరిగింది. దీంతో తన రెమ్యునరేషన్‌ను కూడా వరుణ్ భారీగా పెంచేసినట్టు ఇండస్ట్రీ టాక్.‘గద్దలకొండ గణేష్’ సినిమాకు ముందు వరుణ్ తేజ్ రూ.3 నుంచి రూ.4 కోట్ల పారితోషికం తీసుకున్నారు. 
వరుణ్ తేజకు డిమాండ్

ఈ సినిమా కమర్షియల్‌గా మంచి ఇమేజ్ తీసుకురావడంతో ఇప్పుడు వరుణ్ తేజ్ రూ.7 నుంచి రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ‘తొలిప్రేమ’, ‘ఎఫ్2’, ‘గద్దలకొండ గణేష్’.. ఇలా వరుస హిట్లు పడటంతో వరుణ్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. వరుణ్ రెమ్యునరేషన్ పెంచేసినప్పటికీ నిర్మాతలు బయపడటం లేదని, అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.వరుణ్‌తో సినిమా అంటే హిట్టు గ్యారంటీ అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలుగజేశారు. అందుకే, రెమ్యునరేషన్ పెంచినా నిర్మాతలు భయపడటంలేదట. చూద్దాం వరుణ్ తేజ్ తన మార్కెట్‌ రేంజ్‌ను ఎక్కడ వరకు పెంచుకుంటూ వెళ్తారో..!! కాగా, ప్రస్తుత వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బాక్సింగ్‌లో శిక్షణ కోసం ఇప్పటికే వరుణ్ ముంబై వెళ్లారు. తన కెరీర్‌లో తొలిసారి బాక్సర్‌గా వరుణ్ నటించనున్నారు.

No comments:

Post a Comment