Breaking News

04/07/2019

బిగ్ బాస్ 3పై పెరుగుతున్న ఆశలు


హైద్రాబాద్, జూలై 4   (way2newstv.in)
బిగ్ బాస్ రియాలిటీ షోతో బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్‌ 1కి విశేష ఆదరణ లభించడంతో సెకండ్ సీజన్‌కి నాని హోస్ట్ చేశారు. ఎన్టీఆర్ స్థాయిలో మెప్పించలేకపోయినా.. నాని హోస్ట్‌గా పర్వాలేదనిపించారు. ఇక సీజన్ 3 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. ‘నేనున్నాను’ హోస్ట్‌గా అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు కింగ్ నాగార్జున. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన నాగార్జున తన అనుభవాన్ని ‘బిగ్ బాస్’ హౌస్‌లో రంగరించేందుకు 14 కంటెస్టెంట్స్‌తో రెడీ అయ్యారు. 

బిగ్ బాస్ 3పై పెరుగుతున్న ఆశలు

100 రోజుల పాటు 14 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయబోతున్నారు నాగార్జున. తాజాగా సీజన్ 3 కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో.. నాగార్జున 14 మంది హౌస్ మేట్స్ కోసం మార్కెట్‌లో సరుకులను కొనుగోలు చేస్తూ.. ఈసారి నేను రంగంలోకి దిగుతున్నా అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమం జూలై 21 ప్రారంభం కానుండగా.. ఆఫీషియల్ ప్రకటన రావాల్సిఉంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజుల పాటు ఉండే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే గత సీజన్‌లో కంటెస్టెంట్ ఎవరన్నది ముందే లీక్ కావడంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంది స్టార్ మా. 14 మంది కంటెస్టెంట్స్ ఎవరన్నది చాలా సీక్రెట్‌గా ఉంచింది. అయితే ఈ 14 మంది లిస్ట్‌లో యాంకర్ శ్రీముఖి ఉండటం ఖాయమని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్‌లో భాగంగానే ఆమె పటాస్ షోను వదిలేసిందని తెలుస్తోంది. ఆమెతో పాటు మరికొంత మంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ సందేశ్, వితికా షెరు (వరుణ్ సందేశ్ భార్య), క‌మెడియ‌న్ వైవా హర్ష, యాంక‌ర్ జాహ్నవి, కేఎ పాల్, ‘తీన్మార్’ సావిత్రి, హేమచంద్ర, మనోజ్ నందన్, జబర్దస్త్ పొట్టి రమేష్, కొరియోగ్రాఫర్ రఘులతో పాటు ఇద్దరు కామన్ మేన్‌లను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి

No comments:

Post a Comment