Breaking News

29/06/2019

మంత్రి బోత్సకు ఘన స్వాగతం


విజయనగరం జూన్ 29 (way2newstv.in)
రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివఅద్ధి శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం మొదటిసారి విజయనగరానికి విచ్చేసిన సందర్భంగా.. విజయనగరం జిల్లా శాఖ పక్షాన యుటిఎఫ్ సిబ్బంది, బొత్స సత్యనారాయణ ను కలిసి శుభాభినందనలు తెలిపింది.  ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  


 మంత్రి బోత్సకు ఘన స్వాగతం 

ఈ సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.రాము, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.శేషగిరి, జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర పట్నాయక్, జిల్లా కోశాధికారి జెఎవిఆర్కె.ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి పతివాడ త్రినాధ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు గొలగాన రాజారావు, జిల్లా పూర్వ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, అల్లూరి శివవర్మ లు పాల్గన్నారు.

No comments:

Post a Comment