కౌతాళం, ఏప్రిల్ 1 (way2newstv.in)
అంబులెన్స్ లో వచ్చి స్త్రెచ్చర్ పైనే టిడిపి అభ్యర్థి పాలకుర్తి తిక్క రెడ్డి మరియు వెంకటేశ్వరమ్మ, కన్నీటి బాధతో విలపించారు. అంబులెన్స్ లో నుంచి బయటి కి రాగానే కార్యకర్తలు అభిమానులు అందరూ భావోద్వాగానికి గురయ్యారు. సైకిల్ పట్టాలెక్కింది. ఎవ్వరు ఆపలేరని తిక్కా రెడ్డి తెలిపారు. మాపై ఓర్వలేక నే దాడులు చేశారని పేర్కొన్నారు. రెండు సార్లు బాల నాగి రెడ్డి కి వేశారు. ఇంటికే పరిమితం అయ్యారు. అభివృద్ధి జరగలేదు నేను అభివృద్ధి చేసి చూపించాను. ఈ సారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు ఆదరించి తెలుగుదేశం అభివృద్ధికి కు ఓటు వేయాలని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదివారం ఎరిగేరి,తోవి, బడినేహల్,ఉప్పారహాల్, రౌడుర్, కౌతలం తదితర గ్రామాలలో ప్రచార యాత్రను రోడ్ షో లు ముమ్మరం చేశారు.
సైకిల్ పట్టాలెక్కింది ఎవ్వరు ఆపలేరు : తిక్కా రెడ్డి
ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని అభివృద్ధికి తోడుండాలని ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏమిటో చూపిస్తాం అని తన సత్తా చాటుతానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిస్తనని హామీ ఇచ్చారు. ఈసారి తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం లో 30 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అభివృద్ధి ఏంటో చూపిస్తానని ప్రచార యాత్రలో ప్రజలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వరమ్మ,, ఉలి గాయ్య, గుడిసె శివన్న, సుదీర్ రెడ్డి, సురేష్ నాయుడు వెంకటపతి రాజు, సతీష్ నాయుడు, రామలింగ ,కోటేష్ గౌడ్, టిప్పు సుల్తాన్, చౌదరి బసవ, సిద్దు సాయిబాబా తదితర నాయకులు కార్యకర్తలు సి బి ఎన్ బృందం భారీ సంఖ్యలో పాల్గొన్నారు
No comments:
Post a Comment