Breaking News

11/01/2020

పండుగ వేళ బంగారం ధర.. వెండి పతనం!

ముంబై, జనవరి 11 (way2newstv.in)
పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొన్ని రోజులుగా పరుగులు పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు పడిపోతూ వస్తోంది. పసిడి ధర ఈ రోజు కూడా పతనమైంది. దీంతో బంగారం ధర వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నట్లయ్యింది. పసిడి పడిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యింది. బంగారం కన్నా ఇంకా ఎక్కువగానే పతనమైంది.హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర భారీగా పతనమైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.370 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.37,930కు దిగొచ్చింది. శుక్రవారం బంగారం ధర రూ.38,300 వద్ద ఉన్న విషయం తెలిసిందే.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే భారీగా మాత్రం దిగిరాలేదు. 
పండుగ వేళ బంగారం ధర.. వెండి పతనం!

కేవలం రూ.10 మాత్రమే తగ్గడం గమనార్హం. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,780కు క్షీణించింది. కాగా బంగారం ధర శుక్రవారం నాడు రూ.41,790 వద్ద ఉంది.అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు చల్లారాయని భావించొచ్చు. దీంతో గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు 2 రోజులుగా పడిపోతూ వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు కళ్లెం పడినట్లు ఉంది. అందుకే ఇరాన్‌ జోలికి మళ్లీ వెళ్లడం లేదు. శాంతి మంత్రం జపిస్తున్నారు. దీంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. వెలవెలబోతూ వస్తోంది. 1,600 డాలర్ల వరకు వెళ్లిన పసిడి ఇప్పుడు 1560 డాలర్లకు దిగొచ్చింది.బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,100కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో భౌగోళిక ఉద్రిక్తతలు సద్దుమనగడం సహా పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.400 క్షీణించింది. దీంతో ధర రూ.39,100 నుంచి రూ.38,700కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 క్షీణించింది. దీంతో ధర రూ.39,900కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.400 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,100కు క్షీణించింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.57 శాతం పెరుగుదలతో 1,563.20 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 1.08 శాతం పెరుగుదలతో 18.13 డాలర్లకు ఎగసింది. ఇకపోతే అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర 2019 సెప్టెంబర్ నెలలో కూడా ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ప్రస్తుతం బంగారం ధర తగ్గినా కూడా వచ్చే కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment