Breaking News

07/01/2020

ఫిన్ ల్యాండ్ లో వారానికి నాలుగు రోజులే వర్క్

న్యూఢిల్లీ, జనవరి 7  (way2newstv.in)
ఐటీ సంస్థల్లో ఇప్పటికే రెండు రోజులు వారాంతపు సెలవులు కింద వీక్లీ ఆఫ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ దేశంలో త్వరలో ఉద్యోగుల పనిదినాలను నాలుగు రోజులకు కుదించనున్నారు. మూడు రోజులు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వనున్నారు. అంతేకాదు, పని వేళలు కూడా 4 గంటలకే కుదించనున్నారు. ఈ వరాన్ని ఇస్తున్నది మరెవ్వరో కాదు.. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్.ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రధాని ఎన్నికైన ఆమె.. త్వరలో పాలన వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని యోచిస్తున్నారు. వారంలో మూడు రోజులు సెలవులు ఇవ్వడం ద్వారా తమ దేశంలోని ప్రజలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడిపేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఫిన్ ల్యాండ్ లో వారానికి నాలుగు రోజులే వర్క్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తాము ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం సమయం కేటాయించేందుకు అర్హులు. దీన్ని ఒక సాంప్రదాయంలా పాటించాలి. మన ఉద్యోగ జీవితంలో ఇది మరో ముందడుగు కావాలి’’ అని తెలిపారు. అయితే, ఆమె ఈ నిర్ణయాన్ని రాత్రికి రాత్రే తీసుకోలేదు. ఆమె ఫిన్‌లాండ్ ప్రభుత్వంలో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా పనిచేసిన రోజుల్లో తమ ఉద్యోగులపై ఈ ప్రయోగం చేశారు. దీని వల్ల ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా, ప్రొడక్టివిటీ కూడా పెరిగినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.ఈ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి లీ అండర్సన్ స్వాగతించారు. ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో ఎనిమిది గంటలు పని వేళలు, 5 రోజులు పని దినాలు అమల్లో ఉన్నాయి. ఫిన్‌లాండ్ కంటే ముందు.. 2015లో స్వీడన్ ఆరు గంటల పనిదినాన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయడమే కాకుండా ప్రొడక్టివిటీ కూడా బాగా పెరిగింది. అయితే, మన దేశంలో కేవలం ఐటీ సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు మాత్రమే వీకెండ్ వీక్లీ ఆఫ్‌ల ఈ నిబంధన అమలు చేస్తున్నాయి. మిగతా కార్పొరేట్ సంస్థలు మాత్రం నియమాలను అతిక్రమించి ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి

No comments:

Post a Comment