Breaking News

29/01/2020

మరింత తగ్గిన బంగారం

ముంబై, జనవరి 29 (way2newstv.in)
ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు తగ్గింది. అయితే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం తగ్గితే.. 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. పసిడి ధర మిశ్రమంగా కదిలితే.. అదేసమయంలో వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గడం సహా దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం తగ్గింది. రూ.40 క్షీణంచింది. దీంతో బంగారం ధర రూ.38,760 నుంచి రూ.38,720 దిగొచ్చింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.42,230 నుంచి రూ.42,240 చేరింది.బంగారం ధర మిశ్రమంగా కదిలితే వెండి ధర మాత్రం అక్కడే కొనసాగింది. 
మరింత తగ్గిన బంగారం

కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.49,600 వద్ద నిలకడగానే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,720కు క్షీణించింది. వెండి ధర మాత్రం రూ.49,600 వద్దనే స్థిరంగా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1567.45 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.01 శాతం క్షీణతతో 17.45 డాలర్లకు తగ్గింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,550కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.40,750కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.49,600 వద్దనే ఉంది.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment