Breaking News

30/01/2020

ఉత్తమ పారిశ్రామిక రంగం రాష్ట్రంగా తెలంగాణ: కేటీఆర్ హర్షం

హైదరాబాద్ జనవరి 30  (way2newstv.in)
తెలంగాణ మరో ఘనత సాధించింది. అభివృద్ధి పథంలో మరో ముందడుగు వేసింది.. ఐక్యరాజ్య సమితి ఇండియా నీతి అయోగ్ తాజా గణాంకాలలో సత్తా చాటింది. సమగ్ర సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించింది.పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా అవతరించింది. నీతి అయోగ్ కేంద్రం ఐక్యరాజ్యసమితిలో తెలంగాణ ఉత్తమ పారిశ్రామిక రంగం రాష్ట్రంగా ఆవిర్భవించడం పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 
ఉత్తమ పారిశ్రామిక రంగం రాష్ట్రంగా తెలంగాణ: కేటీఆర్ హర్షం

ఈ మేరకు ట్వీట్ చేసి ఆనందం పంచుకున్నారు.తెలంగాణ కేవలం ఒక సంవత్సరంలోనే వాటిలో చాలా మెరుగైన ఫలితాలను రాబట్టినట్టు గణాంకాలు చెబుతున్నారు.. మంచి పనితీరు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ 2018 లో 75 శాతం నుండి 2019 లో 82 శాతానికి మెరుగుపడింది. వాటిలో అన్నిటికంటే పెద్దది పారిశ్రామిక రంగం ఆవిష్కరణలు మౌళికసదుపాయాల రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ( ఎస్డిజి) 16 శాతం నుండి 61 శాతానికి అద్భుతమైన అభివృద్ధిని కలిగి ఉంది.పారిశుద్ధ్యంలో తెలంగాణ 2018 లో 55 శాతం నుండి 2019 లో 84 శాతానికి స్థోమత మరియు స్వచ్ఛమైన శక్తి 2018 లో 63 శాతం నుండి 2019 లో 93 శాతానికి మారింది. అలాగే శాంతి న్యాయం మరియు బలమైన సంస్థలు ఒక సంవత్సరం లో ఈ శాతం 66 నుండి 77 కి చేరుకుంది.

No comments:

Post a Comment