Breaking News

09/01/2020

బంగారం, వెండి ధరలు పరుగో... పరుగు

ముంబై, జనవరి 9(way2newstv.in)
బంగారం ధర పరుగుకు బ్రేకులు పడ్డాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ బ్యాడ్‌న్యూస్. పసిడి ధర మళ్లీ కొండెక్కింది. భారీగా ర్యాలీ చేసింది. ఎంత తగ్గిందో.. అంతకు ఎక్కువే పెరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారా స్థాయికి చేరుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో పసిడి ధర ఆకాశాన్ని అంటిందిహైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా పరుగులు పెట్టింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.840 పెరిగింది. దీంతో పసిడి ధర రూ.39,270కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ఏకంగా రూ.880 ర్యాలీ చేసింది. దీంతో ధర రూ.42,860కు ఎగసింది.అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. 
బంగారం, వెండి ధరలు పరుగో... పరుగు

ఇరాన్ తిరిగి ఇరాక్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. యుద్ధ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పరుగులు పెట్టింది. పసిడి ధగధగలాడింది.బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పెరిగింది. దీంతో ధర రూ.51,000కు చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు సహా పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.40,100కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.840 పెరిగింది. దీంతో ధర రూ.41,280కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.250 పైకి కదిలింది. దీంతో ధర రూ.51,000కు చేరింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 1.06 శాతం క్షీణతతో 1,557.85 డాలర్లకు తగ్గింది. బంగారానికి ఇది ఆరేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 1.44 శాతం తగ్గుదలతో 18.13 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర 2019 సెప్టెంబర్ నెలలో కూడా ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందేమరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

No comments:

Post a Comment