Breaking News

01/01/2020

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి

శ్రీనగర్‌ జనవరి 1  (way2newstv.in)
జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో భారత బలగాలు బుధవారం  నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తల దాచుకున్నారని బలగాలకు సమాచారం అందండంతో అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. ఉగ్రవాదుల కోసం భారత సైన్యం కూంబింగ్‌ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌ నుంచి నౌషెరా సెక్టార్‌లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి

No comments:

Post a Comment