Breaking News

07/01/2020

దేశీ మార్కెట్‌లో పసిడి ధగధగ

ముంబై, జనవరి 7  (way2newstv.in)
బంగారం భగభగమంటోంది. పసిడి ధర అలసట లేకుండా పరుగులు పెడుతూనే ఉంది. బంగారం ధర ఈ రోజు కూడా భారీగానే పెరిగింది. దీంతో ధర కొండెక్కి కూర్చుంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ బంగారం మిలమిలమంటోంది. అలాగే దేశీ మార్కెట్‌లో డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధగధగ వెలిగిపోతోంది. వెండి ధర పసిడికి రెట్టింపు పెరిగిందిహైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.640 పరుగులు పెట్టింది. దీంతో పసిడి ధర రూ.38,960కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.740 పెరుగుదలతో రూ.42,510కు ఎగసింది. పసిడికి ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి.అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్ని భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. 
దేశీ మార్కెట్‌లో పసిడి ధగధగ

అమెరికా బాగ్దాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లలో దాడి చేయడం, ఇందులో ఇరాన్ సైనికాధికారి మరణించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. రూపాయి పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగారం ధర పరుగులు పెట్టింది.బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా మరింత పెరిగింది. పసిడికి రెట్టింపు స్థాయిలో పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1400 పెరిగింది. దీంతో ధర రూ.51,000కు చేరింది. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు సహా పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.650 ఎగసింది. దీంతో ధర రూ.39,800కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.41,000కు చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా ఏకంగా రూ.1400 పెరిగింది. దీంతో ధర రూ.51,000కు ఎగసింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.16 శాతం క్షీణతతో 1,565.10 డాలర్లకు తగ్గింది. లాభాల స్వీకరణ ఇందుకు కారణం. బంగారానికి ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.19 శాతం తగ్గుదలతో 18.15 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర 2019 సెప్టెంబర్ నెలలో ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందేమరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.పసిడి ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని ఎబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అభిషేక్ బన్సాల్ తెలిపారు. అంతేకాకుండా దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర రూ.50,000కు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

No comments:

Post a Comment