Breaking News

30/01/2020

దిగొస్తున్న బంగారం, వెండి

ముంబై, జనవరి 30, (way2newstv.in)
పసిడి ధర దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. బంగారం ధర మాత్రమే కాకుండా వెండి ధర కూడా వెలవెలబోతోంది. పసిడి బాటలోనే నడిచింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురే.అమెరికా సానుకూల ఆర్థిక గణాంకాల నేపథ్యంలో డాలర్ బలపడింది. దీంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. అంతేకాకుండా దేశీ మార్కెట్‌లోనూ రూపాయి రికవరీ బాట పట్టడంతో పసిడి ధర దిగొచ్చింది. బలమైన ఆర్థిక గణాంకాలతో అమెరికా ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ అంశం కూడా పసిడిపై ప్రభావం చూపింది.
దిగొస్తున్న బంగారం, వెండి

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం భారీగానే తగ్గింది. రూ.340 క్షీణంచింది. దీంతో బంగారం ధర రూ.38,720 నుంచి రూ.38,380కు దిగొచ్చింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో రూ.42,240 నుంచి రూ.41,900కు క్షీణించింది.బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పతనమైంది. దీంతో ధర రూ.49,600 నుంచి రూ.49,200కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,380కు క్షీణించింది. వెండి ధర కూడా రూ.49,200కు పడిపోయింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గుదలతో 1568.45 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.04 శాతం క్షీణతతో 17.25 డాలర్లకు తగ్గింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,200కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గుదలతో రూ.40,400కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.400 క్షీణతతో రూ.49,200కు తగ్గింది.దేశీ మార్కెట్‌లో బంగారం ధర 2019లో ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment