Breaking News

08/01/2020

700 పోస్టింగ్ ల మాటేంటి....

హైద్రాబాద్, జనవరి 8, (way2newstv.in)
ష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వేసిన గ్రూప్2 ఉద్యోగాలు పొందిన 699 మంది పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్నారు. మూడు శాఖల్లో పోస్టింగుల ఆగిపోయాయి. క్వాలిఫై అయినట్టు ప్రకటించి నెలన్నర అవుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో సర్వీసు కాలాన్ని కోల్పోతున్నామని వాళ్లు వాపోతున్నారు. 1,032 పోస్టుల భర్తీ కోసం 2015 డిసెంబర్ 31న సర్కార్ గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చింది. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో పరీక్ష పెట్టింది. 2017 జూన్2న టీఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడించింది. అయితే, పరీక్షల్లో వైట్నర్ వాడకం, మరికొన్ని అంశాలపై కొందరు అభ్యర్థులు కోర్టుకెళ్లారు. కేసు ముగిసిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 25న టీఎస్పీఎస్సీ తుది ఫలితాలను ప్రకటించింది. ఇంటర్వ్యూలు పెట్టి ఫైనల్గా 1,027 మందిని సెలెక్ట్ చేసింది. అయితే, ఇప్పటికే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఈవోపీఆర్డీ, అసిస్టెంట్ రిజిస్ట్రర్ ఆఫీసర్లకు పోస్టింగులు ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. 
700 పోస్టింగ్ ల మాటేంటి....

వాళ్లు డ్యూటీలూ చేస్తున్నారు.మూడు శాఖలకు ఎంపికైన వారికి మాత్రం ఇంకా పోస్టింగ్లు ఇవ్వలేదు. 259 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 284 అబ్కారీ ఎస్ఐలు, 156 మంది అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో)లకు నెల క్రితమే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినా ఇప్పటికీ పోస్టింగులివ్వలేదు. దీంతో వారు ఆవేదన చెందుతున్నారు. మిగతా వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చిన వారంలోనే పోస్టింగులిచ్చినా, తమకు మాత్రం ఇంకా ఇవ్వలేదని కరీంనగర్కు చెందిన ఏసీటీవోగా ఎంపికైన వ్యక్తి చెప్పారు. దాని వల్ల జీతంతో పాటు సర్వీస్ కాలం కూడా పోతుందని ఆవేదన చెందారు. ఆ మూడు శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుత సీఎస్ సోమేశ్కుమార్ ఉండేవారు. అయితే, శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన సీఎస్, ఎంపికైన అధికారుల శిక్షణపై చర్చించారు. వసతి, టూర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే, కేవలం శిక్షణ గురించి మాత్రమే మాట్లాడిన సీఎస్, శిక్షణ, పోస్టింగుల తేదీల గురించి మాత్రం మాట్లాడలేదని ఎంపికైనోళ్లు వాపోతున్నారు. కాగా, మూడు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సీనియర్లకు తాత్కాలిక ప్రమోషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఎంపికైన ఉద్యోగులకు పోస్టింగులిస్తే, తాత్కాలికంగా డిప్యూటేషన్ పొందినోళ్లు తమ యథాస్థానాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే, దాని వల్ల ఆయా శాఖల్లో టీం డిస్టర్బ్ అవుతుందని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసన తర్వాతే ఎంపికైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా సర్కారు వద్ద నిధులు లేకపోవడం వల్లా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదన్న వాదనా వినిపిస్తోంది.

No comments:

Post a Comment