Breaking News

23/12/2019

కలెక్టర్ ను సత్కరించిన జిల్లా అధికారులు

శ్రీకాకుళం, డిసెంబరు 23 (way2newstv.in)
ఉపాధి హామీ పథకం పనితీరులో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో జిల్లా నిలిచినందుకుగాను జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హెచ్. కూర్మారావు ను జిల్లా అధికారుల సంఘం ఘనంగా సత్కరించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం అధికారుల సంఘం సన్మానించింది. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు , డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, ట్రెజరర్, బిసి కార్పొరేషన్ ఇ డి జె. రాజారావు, కార్యదర్శి, ఎస్ సి కార్పొరేషన్ ఇ డి మహాలక్ష్మి ఘనంగా సత్కరిస్తూ జాతీయ అవార్డు రావడం స్ఫూర్తిదాయకమన్నారు. 
కలెక్టర్ ను సత్కరించిన జిల్లా అధికారులు

కష్టపడి పనిచేసే జిల్లా అధికారులు ఉన్నారని, మరిన్ని అవార్డులు, వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ కోరారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి,  ఏపిఎంఐపి పిడి ఏవిఎస్వి జమదగ్ని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా ఎం.చెంచయ్య,  ఐసిడిఎస్ పిడి జి.జయదేవి,జిల్లా బిసి సంక్షేమ అధికారి కె. కృత్తిక తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment