Breaking News

23/12/2019

కలియుగ భారతంలో సహితం ద్రౌపదులు

డెహ్రాడూన్ డిసెంబర్ 23  (way2newstv.in)
మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారు అంటే హే హే హే అంటూ నవ్వుతారు కొందరు. ఆనాడే కాదు ఈనాడు కూడా ఐదుగురు భర్తలను చేసుకునే మహిళలు ఉన్నారంటే నమ్మగలరా? అంటే నమ్మి తీరాలి.ఎందుకంటే ఉత్తర డెహ్రాడూన్ ప్రావిన్స్‌ లోని కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఇదే ఆచారం కొనసాగుతున్నది. ఈ గ్రామాలలో ఒక కుటుంబంలోని అన్నదమ్ములందరూ ఒకే మహిళను వివాహం చేసుకుంటున్నారు. 
కలియుగ భారతంలో సహితం ద్రౌపదులు

ముగ్గురు నలుగురు లేదా ఐదుగురు సోదరులు ఉన్నా ఒకే మహిళను పెళ్లి చేసుకోవాలి.తమ ప్రాంతంలో మహాభారతం జరిగిన కాలం నాటి నుంచి కూడా ఇదే ఆచారం కొనసాగుతున్నదని వారు చెబుతున్నారు. ఒక భార్య తన భర్త సోదరులందరినీ వివాహం చేసుకోవాలి.  ప్రతిరోజూ ఒకరితో ఒకరు నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల కుటుంబానికి సంపద వస్తుందని నమ్ముతారు.  భర్తలందరినీ సమానంగా ప్రేమించడం ఆచారం.

No comments:

Post a Comment