Breaking News

02/12/2019

హస్తినకు కేసీఆర్

హైద్రాబాద్, డిసెంబర్ 2, (way2newstv.in)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన చేరుకున్నారు. సోమవారం సీఎం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉందని సీఎంవో కార్యాలయం సమాచారం అందించింది. అలాగే ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కలిసే అవకాశం ఉంది.
హస్తినకు  కేసీఆర్

ప్రధానమంత్రితో భేటీలో ప్రధానంగా.. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్‌ గడ్కరీలను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. కేసీఆర్ ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది

No comments:

Post a Comment