Breaking News

05/11/2019

‘ఎల్వీని బదిలీ చేయడం ఘోరం.. కేంద్రం అన్నీ గమనిస్తోంది

న్యూఢిల్లీ నవంబర్ 5 (way2newstv.in)  
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందన్నారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. 
‘ఎల్వీని బదిలీ చేయడం ఘోరం.. కేంద్రం అన్నీ గమనిస్తోంది

‘ఇది రాచరిక జమానా కాదు.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఐదు నెలలుగా అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా హోల్డ్లో ఉంచారు. సామాజికవర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోంది.. కళ్లు మూసుకుని లేదు. ఇసుక ద్వారా కేవలం రూ.300కోట్ల వరకే ఆదాయం, అంతకు మించి రాదు. ఇసుక కొరత, వరదల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది’ అని సుజనా విమర్శలు గుప్పించారు.

No comments:

Post a Comment