Breaking News

19/11/2019

మళ్లీ చంద్రబాబు కేసులు విచారణ

విజయవాడ, నవంబర్ 19 (way2newstv.in)
టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తుల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు ఓకే చెప్పింది. హైకోర్టు ఇచ్చిన స్టే పొడిగింపు లేకపోవడంతో.. విచారణ ప్రారంభిస్తామని జడ్జి తెలిపారు. అలాగే ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని.. ఈ నెల 25కు విచారణను వాయిదా వేశారు. సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, స్టేకు సంబంధించి హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో.. కేసులో విచారణ ప్రక్రియను ప్రారంభి స్తామని జడ్జి  ఉత్తర్వులు జారీ చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని.. 
మళ్లీ  చంద్రబాబు కేసులు విచారణ

ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ప్రారంభంకాక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. తర్వాత బాబు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు.అనంతరం ఈ స్టేను ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా.. హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి ఈ స్టే కొనసాగుతోంది. తర్వాత సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు రావడంతో.. ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. తర్వాత కొద్దిరోజులకే జడ్జి బదిలీ అయ్యారు. అయితే సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు చంద్రబాబు తరఫు న్యాయవాది.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందని వాదించారు. లక్ష్మీపార్వతి తరపు లాయర్ సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవన్నారు2005లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన జడ్జి.. 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో 2005లో విధించిన స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి క్లారిటీ లేదని జడ్జి గుర్తు చేశారు. దీంతో ఈ కేసులో విచారణ ప్రక్రియను ప్రారంభించారు.

No comments:

Post a Comment