Breaking News

22/11/2019

నంద్యాల నుండి అమరావతి కి అదనపు రైళ్లు నడపాలి

సీ.పీ.ఐ డిమాండ్
నంద్యాల నవంబర్ 22(way2newstv.in)
నంద్యాల నుండి  రాష్ట్ర రాజధాని విజయవాడకు అదనపు రైళ్లు నడపాలని సీపీఐ పార్టీ నాయకులు శుక్రవారం నాడు నంద్యాలకు వచ్చిన రైల్వే జనరల్ మేనేజర్ కు . భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ నంద్యాల సమితి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి  ఎస్ బాబా ఫక్రుద్దీన్. సీపీఐ  పార్టీ పట్టణ కార్యదర్శి ప్రసాద్. ఏఐటియుసి నంద్యాల నియోజకవర్గం కార్యదర్శి బాల వెంకట్. లతో కలిసి  వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల నుండి రాష్ట్ర రాజధానికి అదనపు రైళ్లు నడపాలని. అలాగే నంద్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టాలని. 
నంద్యాల నుండి అమరావతి కి అదనపు రైళ్లు నడపాలి

నంద్యాల రైల్వే స్టేషన్ లో వృద్ధులకు వికలాంగులకు పిల్లలకు ఎక్స్ లెటర్ లిఫ్ట్ ఏర్పాటు చేయాలని. నంద్యాల మీదుగా ముంబై చెన్నై తిరుపతికి రైళ్లను ఏర్పాటు చేయాలని. డెమో రైలు స్థానంలో ప్యాసింజర్ రైళ్లను నడపాలని. రైల్వే స్టేషన్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ లో రైలు వచ్చే సమయానికి బయట ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రోడ్ల విస్తరణ చేపట్టాలని. అలాగే నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద పాదచారులకు  అండర్  గ్రౌండ్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment