Breaking News

05/11/2019

గోలింగేశ్వర ఆలయంలో షష్టి ఉత్సవాలు

కాకినాడ  నవంబర్ 5, (way2newstv.in)
బిక్కవోలు......చారిత్రక ప్రసిద్ధి గాంచిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఉత్సవాలకు పందిరి రాట ప్రతిస్థాపనతో నాంది పలికారు. మండలకేంద్రమైన బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన కార్యక్రమంలో షష్ఠి ఉత్సవ కమిటీ అధ్యక్షులు జె.వి.వి.సుబ్బారెడ్డి షష్ఠి ఉత్సవాల పందిరి రాటను ప్రతిష్టించి షష్ఠి ఉత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. 
గోలింగేశ్వర ఆలయంలో షష్టి ఉత్సవాలు

ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా విశేషంగా భక్తులు దర్శించుకున్నారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ వచ్చే డిసెంబరు 1 నుండి 8 వ తేదీ వరకు జరిగే షష్ఠి ఉత్సవాలను ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగానిర్వహించనున్నామన్నారు.  కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం,  పంచాయతీ కార్యదర్శి KSN రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు యామసాని రవి, యరకారెడ్డి సత్య, తమ్మిరెడ్డి నాగశ్రీనివాసరెడ్డి, గంగాధరరెడ్డి, కన్నారావు, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment