Breaking News

19/11/2019

ఏపీలో బార్ల సంఖ్య తగ్గింపు

అమరావతి    నవంబర్ 19 (way2newstv.in)            
బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం సమీక్ష భేటీ నిర్వహపించారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయించారు. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించనున్నారు. సీఎం మాట్లాడుతూ బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని అన్నారు. ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిద్దామని  అధికారులు తెలిపారు. సుదీర్ఘ చర్చ తర్వాత బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. 
ఏపీలో బార్ల సంఖ్య తగ్గింపు

బార్లలో మద్యం సరఫరా వేళల కుదింపు వుంటుంది. బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, రాత్రి 11 వరకూ ఆహారం వుంటుంది. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం విక్రయాలు వుంటాయి. బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం వున్నట్లు సమాచారం. మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తప్పవు. నాన్బెయిల్ బుల్ కేసులు నమోదుతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని సమావేశంలో నిర్ణయించారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలన్న సీఎం సూచించారు.

No comments:

Post a Comment