Breaking News

05/11/2019

బడులు, ఆసుపత్రులపై సీఎం జగన్ సమీక్ష

ప్రమాణాలు పెంచాలని అధికారులకు సూచన
అమరావతి నవంబర్ 5, (way2newstv.in)
స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆళ్లనాని, అధికారులు హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు –నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాదాపు 45వేల స్కూళ్లను నాడు – నేడు కింద బాగుచేస్తున్నామని వెల్లడించారు. తర్వాత దశలో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, గురుకులపాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగు చేస్తున్నాం. దీనికోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్బోర్డ్స్ పెయింటింగ్, ఫినిషింగ్.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 
బడులు, ఆసుపత్రులపై సీఎం జగన్ సమీక్ష

నాడు– నేడు కింద స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతున్నాం. ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్ లిస్టు ఉండాలి. నవంబర్ 14న స్కూళ్లలో నాడు–నేడు ప్రారంభం అవుతుందని అయన అన్నారు. నాడు–నేడులో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నాం. స్కూళ్లకు సంబంధించిన పరిపాలన అంశాల్లోనే కాదు, నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం. దీనికి సంబంధించి పాఠ్యప్రణాళిక రెడీచేయాలని సూచించారు. స్కూలు ప్రారంభంకాగానే వారికి యూనిఫారమ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలి. స్కూలు తెరిచిన తర్వాత సెప్టెంబరు, అక్టోబరు వరకూ పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదు. ఆపై వచ్చే ఏడాది 9 తరగతిలో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని అన్నారు. అలాగే నాడు – నేడు కింద అన్ని ప్రభుత్వాసుపత్రులనూ బాగు చేస్తున్నాం. సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులు కూడా బాగు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో కూడా మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. 510రకాలకు పైగా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 15 నుంచి కూడా ఈమందులు అందుబాటులో పెడుతున్నాం. నాడు– నేడు కార్యక్రమంలో ఇది చేస్తున్నాం. నెట్వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రమాణాలు బాగా పెరగాలని అయన అన్నారు. వచ్చే మే నెల నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ కావాలి. జనవరిలో దీనికి సంబంధించి భర్తీకోసం క్యాలెండర్ ఇవ్వాలి. స్కూళ్లలో, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి సరైన ప్రణాళిక ఉండాలి. దీనికి సంబంధించి ఆర్థిక వనరులు లోటు లేకుండా చూసుకోవాలి. మండలంలోని మంచి హైస్కూల్ను జూనియర్కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని అన్నారు.

No comments:

Post a Comment