Breaking News

11/11/2019

రెండు రైళ్లు ఢీ…పదిమందికి గాయలు

హైదరాబాద్ నవంబర్ 11, (way2newstv.in)
హైదరాబాద్ లోని కాచిగూడలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పైకి ఎంఎంటీఎస్ రైళ్లు వచ్చాయి. రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సిగ్నల్ లోపంతోనే రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గాయాపడినివారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. రెండు బోగీల మధ్య లొకో పైలట్  శేఖర్ చిక్కుకున్నాడు. సిగ్నల్ చూసుకోకుండాఒక ఎంఎంటీఎస్ ట్రైన్.. మరొక కర్నూల్ ఇంటర్ సిటీ ట్రైన్ రెండు ఢీ కొన్నాయి.
 రెండు రైళ్లు ఢీ…పదిమందికి గాయలు

రెండు రైళ్లు ఒకేసారి ఢీ కొనడంతో . ఈ ఘటనలో ఎంఎంటీఎస్ కు చెందిన మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. మరో ఆరు బోగీలు పక్క ఉన్న పట్టాలపై పడిపోయాయి.. దీంతో అటు నుంచి.. ఇటు నుంచి.. వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటనతో ఒకేసారి అక్కడి ప్రయాణికులు భయాందోళన చెందారు. ఎంఎంటీఎస్ రైలు తక్కువ వేగంగా ప్రయాణిస్తుండటంతో భారీ ప్రమాదం తప్పింది. రైలు వేగంగా ప్రయాణించి ఉంటే ఎంతో మంది దుర్మరణం పాలయ్యే అవకాశం ఉండేది  ప్రమాదఘటన ప్రాంతానికి   రైల్వే అధికారులు,  పోలీసులు చేరి పరిస్థితిని సమీక్షించారు.  

No comments:

Post a Comment