Breaking News

14/11/2019

నాలుగు రోజులు తర్వాత పెరిగిన బంగారం ధర

ముంబై, నవంబర్ 14  (way2newstv.in)
నాలుగు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధర ఈ రోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరిగింది. దీంతో ధర రూ.39,640కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.120 పెరిగింది. దీంతో ధర రూ.36,340కు చేరింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. రూ.20 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,770కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 
నాలుగు రోజులు తర్వాత పెరిగిన బంగారం ధర

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.38,300కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.37,100కు ఎగసిందిబంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.20 పెరిగింది. దీంతో ధర రూ.48,770కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 1,463.55 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 16.88 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment