Breaking News

19/11/2019

మళ్లీ పడిపోయిన పసిడి

ముంబై, నవంబర్ 19 (way2newstv.in)
() పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గింది. దీంతో ధర రూ.39,670కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.90 తగ్గింది. దీంతో ధర రూ.36,360కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. రూ.200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.47,800కు క్షీణించింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 
మళ్లీ పడిపోయిన పసిడి

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,300కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 క్షీణతతో రూ.37,100కు తగ్గింది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.200 పతనమైంది. దీంతో ధర రూ.47,800కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.11 శాతం పెరుగుదలతో 1,473.45 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 17.02 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి చేరింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

No comments:

Post a Comment