Breaking News

11/11/2019

వివాదస్పద కామెంట్లతో ఆర్జీవీ

హైద్రాబాద్, నవంబర్ 11 (way2newstv.in)
కమ్మ రాజ్యం కడప రెడ్లు’ అంటూ మరోసారి వర్మ తన పైత్యానికి పదును పెట్టారు. కంటెంట్ మాట పక్కనపెట్టేసి ఏదో ఒక వివాదంతో సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో సిద్ధహస్తుడైన వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద మూవీని తెరక్కించిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టర్‌లను విడుదల చేస్తూ అగ్గిరాజేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో తాను ఎవర్ని టార్గెట్ చేయబోతున్నారో ముందు హింట్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను పోలిన పాత్రల్ని తనకు నచ్చినట్టు చూపించారు వర్మ.
వివాదస్పద  కామెంట్లతో ఆర్జీవీ

లోకేష్ బాబుకి పప్పు వడ్డిస్తూ ఉన్న చంద్రబాబు.. ‘ఇక ప్రశ్నించే ప్రసక్తిలేదు.. చేయడమే’ అని పవన్ పాత్రధారి చెప్తున్న డైలాగ్స్ ఆయా పార్టీల్లో మంటపుట్టించేవిగా ఉన్నాయి. ఇక పప్పు అంటూ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన సాంగ్ దారుణం అంటే దారుణం అనే చెప్పాలి.ఇక వర్మ పైత్యాన్ని పరాకాష్టకు చేర్పించడంతో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో కత్తి మహేష్ ఓ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రంలో పవన్, లోకేష్ బాబు పాత్రల్లో కనిపించిన నటులతో కలిసి దిగిన ఫొటోని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు కత్తి మహేష్.ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిన నటుడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఉండగా.. లోకేష్ బాబు పాత్రధారి పవన్ భుజంపై చేయి వేసి ఉన్నారు. ఈ బార్‌లో దిగారో తెలియదు కాని.. రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీలోని పీకే, లోకేష్ బాబులతో నేను’ అంటూ ఫొటోకి క్యాప్షన్ పెట్టి మరీ వదిలారు కత్తి మహేష్.ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు. అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment