Breaking News

12/11/2019

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి నవంబర్ 12, (way2newstv.in)
కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల భారీ సంఖ్యలో పోటెత్తారు. .కార్తీక పౌర్ణమి ఉదయాన్నే స్నానాలు ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధన చేస్తూ తమకు అంత మంచి జరగాలని స్వామి వారిని  వేడుకున్నారు. 
యాదాద్రిలో భక్తుల రద్దీ

కార్తీక దీపారాధన చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక దీపారాధన,సత్యనారాయణ వ్రతాలు చేసుకొని భక్తులు శివాలయంలో శివుణ్ణి, బాలలయం లో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దర్శనానికి వెళ్లి బారులు తీరారు.

No comments:

Post a Comment