Breaking News

19/11/2019

ఇసుక రేటును పెంచుతున్నారు

అమరావతి నవంబర్ 19 (way2newstv.in)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి ట్వీట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మీ పేపర్లో దొరుకుతున్న ఇసుక బయట ప్రజలకు దొరకడం లేదు జగన్ గారని వ్యాఖ్యానించారు. ఇసుక అక్రమార్కుల పై ఉక్కుపాదం మోపుతాం అంటూ భారీగా ప్రకటనలు ఇస్తున్నారు. 
 ఇసుక రేటును పెంచుతున్నారు

మీరు చెప్పిన టోల్ నెంబర్ నిజంగా పనిచేస్తే మీ పార్టీ ఇసుకాసురుల కోసం పక్క రాష్ట్రం జైళ్లు కూడా అద్దెకు తీసుకోవాలని అన్నారు. మీ నూతన ఇసుక పాలసీ వలన 50 మంది కార్మికులు బలైయ్యారు,నిర్మాణ రంగం పడకేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇసుక రేటుని మీ నాయకులు పెంచుకుంటూ పోతున్నారు. మీ పత్రికలో ప్రకటనలకు కోసం వృధా అవుతున్న ప్రజా ధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తామని అన్నారు.

No comments:

Post a Comment